నర్సీపట్నం : రెండో విడత ఉచిత రేషన్ బియ్యం, పప్పును వాలంటీర్లు ద్వారా ఇంటింటికీ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు 5,10,15,20 కిలోల బియ్యాన్ని సంచుల్లో నింపి, పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. డీలర్ల నుంచి వాలంటీర్లు బియ్యాన్ని తీసుకుని, కూపన్లు వారీగా కేటాయించిన సమయంలో 16 నుంచి కార్డుదారులకు అందజేయనున్నట్లు ఎఎస్ఒ రుద్రరాజు సత్యనారాయణ తెలిపారు.
ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు